కాంగ్రెస్ లో జైలుకి వెళ్లి వచ్చినవారే ఉంటారు : ఎంపీ మునిస్వామి

-

దేశ వ్యాప్తంగా ఎస్సీ మోర్చా నిరసనలు చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ తీసేస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యలని ఖండిస్తున్నాము అని ఎంపీ మునిస్వామి అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కి వ్యతిరేకంగా రాహుల్ గాంధి యే మాట్లాడలేదు, 1956 లో ఓబీసీ కి వ్యతిరేకంగా నెహ్రు కూడా మాట్లాడారు. రాజీవ్ గాంధీ రిజర్వేషన్స్ విషయంలో బుద్ది హీనులని వ్యాఖ్యాణించారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎస్సీ ల దగ్గరకి వచ్చి ఓట్లని అడుగుతారు కానీ రిజర్వేషన్స్ విషయంలో మాత్రం వ్యతిరేకత చూపిస్తారు. దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల అభివృద్ధి కోరుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ చైనా తో పాకిస్థాన్ తో రహస్యంగా మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ లో ఉండేవారు అందరు జైలు కి వెళ్లి వచ్చినవారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం తో వ్యతిరేకంగా ఉండేవారితో చేతులు కలిపేవారు. ఇండియా మిత్ర కూటమిలో ఉన్న వారు కూడా మద్దతు తెలియచేస్తున్నారు. అలీబాబా 40 దొంగలు లెక్క ఇండియా కూటమి ఉంది. మొదటి సారి మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ కలిపించిన రిజర్వేషన్స్ ఆశయాలు వల్లే అని వ్యాఖ్యాణించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ మరణించినప్పుడు రాజ్ ఘాట్ లో జాగా ఇవ్వలేదు. కాంగ్రెస్ అగ్ర నాయకులు మరణించినప్పుడు రాజ్ ఘాట్ లో ఎక్కువ స్థలం కేటాయించి సమాధులు నిర్మించారు. జగన్ మోహన్ రెడ్డి సైతం సోనియా గాంధీ ఎలా ప్రవర్తించేదో కదాచిత్రంలో చూపించారు. అలాంటి సోనియా దగ్గరకి వైస్సార్ కూతురు షర్మిల దగ్గరకి వెళ్ళింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version