రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ తెలిసింది: రిషభ్ పంత్

-

రోడ్డు ప్రమాదంతో జీవితం విలువ తెలిసిందని  రిషభ్ పంత్ అన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీం ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలో పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని చెప్పాడు. “ఇప్పుడు బాగున్నా. కోరుకుంటున్నా. దేవుడి దయ, వైద్య సిబ్బంది సహకారంతో త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తా” అని చెప్పాడు.

ప్రమాదం తర్వాత పళ్ళు తోముకోవడం కూడా సంతోషాన్నిస్తోందని అన్నాడు. ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత మీ జీవితం మారినట్లు అనిపిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ, “నాచుట్టూ ఉన్నదంతా మరింత సానుకూలంగా మారిందో లేదా ప్రతికూలంగా మారిందో చెప్పలేను. అయితే జీవితం విషయంలో నా దృష్టి కోణం మారింది. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. సాధారణంగా మనం పట్టించుకోని దైనందిన కార్యకలాపాలను కూడా ఆస్వాదిస్తున్నా. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ప్రత్యేకమైనది సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు” అని పంత్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news