యాక్సిడెంట్​ తర్వాత తొలిసారి ట్వీట్​ చేసిన పంత్​

-

ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముంబయిలో చికిత్స పొందుతున్న టీమ్ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్ పంత్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ప్రమాదానికి గురైన తర్వాత పంత్ మొదటిసారిగా సోషల్ మీడియాలో కనిపించాడు. తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, అభిమానులకు, వైద్యులకు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు.

“నాకు మద్దతుగా నిలిచిన అభిమానులు, సహచర ఆటగాళ్లు, వైద్యులు, ఫిజియోలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరినీ మైదానంలో చూడాలని ఎదురుచూస్తున్నాను. నా శస్త్రచికిత్స విజయవంతమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ప్రస్తుతం కోలుకుంటున్నాను. రాబోయే సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా వెన్నంటే ఉన్న బీసీసీఐకి, జై షాకు, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడిన రజత్‌ కుమార్‌, నిషు కుమార్‌లకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను” అని పంత్‌ ట్వీట్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news