BREAKING : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై బహిష్కరన వేటు..!

-

బీహార్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుబోతున్నాయి. ఆర్జేడీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను ఆరేళ్ల పాటు బహిష్కరించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయించుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంతోనే ప్రేమ చౌదరి, మహేశ్ ప్రసాద్ యాదవ్, ఫరాజ్ ఫాత్మీ లపై బహిష్కరన వేటు పడింది.

 

 

ఈ బహిష్కరణ ఆరేళ్ల పాటు కొనసాగుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలోక్ మెహతా ప్రకటించారు. ఇకపోతే బహిష్కరణకు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సీఎం నితీశ్ కుమార్ తో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల సమయంలో ఆర్జేడీ  ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news