తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లిన వాళ్లంతా తిరుగు ప్రయాణంలో వారి కోసం మృత్యువు ఎదురుచూస్తుందని తెలుసుకోలేక పోయారు. ఇంటికి వెళ్తున్నామన్న ఆనందంలో ఉన్న వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. టెంపోను లారీ ఢీ కొట్టిన ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడ్ మృతి చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది.

వైఎస్సార్ జిల్లా చాపాడు వద్ద.. హుబ్లీ-కృష్ణపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. టెంపో వాహనం టైర్‌ పంక్చర్ కావడంతో అదుపుతప్పి.. రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మృతులు.. రాములమ్మ, ఓబులమ్మ, అనూషగా గుర్తించారు. గాయపడ్డవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటారనగా… ప్రమాదం చోటుచేసుకోవడం.. మృతులు, క్షతగాత్రుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news