మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో రాఖీ భాయ్..KGF2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యశ్

-

రాకింగ్ స్టార్ యశ్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరెక్కిన KGF2 ఫిల్మ్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా విడుదలైన చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ వన్ ను మించిన రెస్పాన్స్ కేజీఎఫ్ టూ కు రావడం పట్ల మూవీ యూనిట్ సభ్యులు, సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో రాఖీభాయ్ ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు సినీ లవర్స్. చిత్రం అతి త్వరలో నే రూ.1,000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం ఏళ్లపాటు సమయం వెచ్చించిన యశ్..ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ వైపు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరో వైపు తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లాడు.

సమ్మర్ వెకేషన్ అయిన మాల్దీవ్స్ లో చల్లటి వాతావరణంలో తన భార్య రాధికా పండిట్, పిల్లలతో యశ్ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా యశ్ తన భార్యతో కలిసి ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.

రాధికా పండిట్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికి వెకేషన్ చాలా ముఖ్యమని, తద్వారా నూతనోత్సాహ వస్తుందని చెప్పింది. యశ్ ప్రస్తుతం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. తనకు ఇంతటి విజయాన్ని సినీ ప్రేక్షకులకు, తన పట్ల ప్రేమ చూపుతున్న అభిమానులకు యశ్ ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news