మళ్లీ చెబుతున్నా.. నేను దానికి సిద్ధం : రోహిత్ శర్మ

-

ఐపీఎల్ టోర్నీ ముగియగానే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు మొదట రోహిత్ శర్మను ఎంపిక చేయని బిసిసిఐ ఆ తర్వాత విమర్శలు రావడంతో ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఏ స్థానంలో ఆడబోతున్నాడు అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కె.ఎల్.రాహుల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓపెనర్ గా రంగంలోకి దిగే రోహిత్ శర్మ స్థానంలో ఆడబోతున్నాడు అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.

అయితే తాజాగా రోహిత్ శర్మ తాను ఏ స్థానంలో బరిలోకి దిగుతాను అనే దాని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తాను ఏ స్థానంలో బరిలోకి దిగి బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పానని ప్రస్తుతం కూడా ఇదే విషయాన్ని చెబుతున్నానని జట్టు యాజమాన్యం తను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు పంపిస్తే ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని జట్టు విజయానికి తప్పక కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జట్టులో తన ఓపెనర్ స్థానాన్ని మారుస్తారా లేదా అన్న విషయంపై తనకు క్లారిటీ లేదని… చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

Read more RELATED
Recommended to you

Latest news