రాజన్న నిజమైన బిడ్డ జగన్ ఏ: రోజా

-

మంత్రి రోజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజన్న నిజమైన బిడ్డ జగన్ మాత్రమేనని రోజా కామెంట్స్ చేసింది. ఎన్నికలవేళ ఆంధ్ర ప్రదేశ్ లో ఏపీ సీసీచీఫ్ షర్మిల వర్సెస్ వైసిపి గా రాజకీయం మారింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న షర్మిల సోదరుడు సీఎం జగన్ వైసీపీ నేతలపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. షర్మిల కి ధీటుగా వైసిపి నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. వైయస్ షర్మిల మంత్రి రోజా మధ్య వార్ నడుస్తోంది.

వైయస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మాట్లాడుతూ షర్మిల మొన్నటి వరకు తను తెలంగాణ బిడ్డ అన్నారు. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని అన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమీ చేయలేక గాలికి వదిలేసారు అని రోజా అన్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి విచ్చిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల కేవలం వైయస్ అసలు ఆస్తులు కోసమే రోడ్డుకు ఎక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news