పిల్లబిత్తిరీ లోకేష్ కు బలుపు ఎక్కువైంది – మంత్రి రోజా

-

ఒక్క సీటు గెలిచిన…పిల్లబిత్తిరీ లోకేష్ కు బలుపు ఎక్కువైందని విమర్శలు చేశారు మంత్రి ఆర్కే రోజా. ఇవాళ సింహాంద్రి అప్పన్న దేవాలయాన్ని సందర్శించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పిల్లబిత్తిరీ లోకేష్ ఎమ్మెల్సీ సీట్లు గెలిచామని మాట్లాడుతున్నాడు..చంద్రబాబు కలలో కూడా గెలుపును ఊహించలేదని తెలిపారు.

పార్టీ కమ్మిట్ మెంట్ ఉన్నవాళ్లు, పార్టీ పై నమ్మకం ఉన్నవాళ్లు పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ రోజు వేరే పార్టీకి వెళ్లినవారందరూ జగన్ చరిష్మాతో గెలిచినవారేనని విమర్శలు చేశారు. కరోనా సమయంలో నీ ప్రాణాన్ని కాపాడారు అన్నప్పుడు, మా పార్టీకి ఎందుకు ఓటు వెయ్యలేదు..చంద్రబాబును నమ్మిన ఎన్టీఆర్ కే దిక్కులేదు.. ఆయనకు మిగతవారెంత? అని ఫైర్‌ అయ్యారు. ఎక్కువ ఎమ్మెల్సీ గెలిచిన మేము కామ్ గా ఉన్నాం…అతి తక్కువ వొచ్చిన వారికి బలుపు ఎక్కువయిందని విమర్శలు చేశారు మంత్రి ఆర్కే రోజా.

Read more RELATED
Recommended to you

Latest news