జోర్దార్ సుజాత – రాకింగ్ రాకేష్ జంటపై రోజా ఎమోషనల్ పోస్ట్

-

జోర్దార్ సుజాత – రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, తాజాగా వివాహ బంధంతో జోర్దార్ సుజాత – రాకింగ్ రాకేష్ జంట ఒక్కటైంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ పెళ్లికి కేవలం ఇరువురు కుటుంబ సభ్యులు, జబర్థస్త్ కమెడియన్ ల సమక్షంలోనే జరిగినట్లుగా సమాచారం. అయితే, దీనిపై మంత్రి రోజా స్పందించారు.


” మాంగల్యం తంతునానేన..మమ జీవన హేతునా!కంఠే బధ్నామి సుభగే!త్వంజీవ శరదాం శతమ్ ” అంటూ రోజా పోస్ట్‌ పెట్టింది. నాకు అత్యంత ఆప్తులు నన్ను అమ్మా అని పిలిచే రాకేష్‌ మరియు సుజాత యొక్క సుఖ జీవనానికి హేతువైన మంగళ సూత్రంతో మాంగల్యాన్ని సుజాత మెడలో కట్టిన శుభగడియలో ఈ జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లుగాక అంటూ ఆ కొత్త జంటను ఆశీర్వదించింది. సుఖీభవ సుమంగళి సుఖీభవా సు(జాత)శీలవై చిరాయువై సుఖీభవా… అంటూ కామెంట్స్‌ చేసింది రోజా. ఈ పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

https://www.instagram.com/p/CpCPxvcJaPM/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news