లోకేష్ నావల్ల కాదని… జూనియర్ ఎన్టీఆర్ ను రావాలని కోరుతున్నాడు – రోజా

-

లోకేష్ నావల్ల కాదని… జూనియర్ ఎన్టీఆర్ ను రావాలని కోరుతున్నాడని ఏపీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ ఎన్టీఆర్‌ది..అందుకే చంద్రబాబు, లోకేష్ దొంగళ్లా బతుకుతున్నారని చురకలు అంటించారు మంత్రి రోజా. పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు లోకేష్ తీరు ఉంది..లోకేష్ తన స్ధాయికి నుంచి మాట్లాడుతూన్నాడని ఆగ్రహించారు. ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడు… లోకేష్ కూడా అదే కావాలని కోరుకుంట్లుందని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లా లో లోకేష్ తిరగగలడా….అని సవాల్‌ చేశారు.

చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయండి…లోకేష్ ఒక పిల్లా పిత్రేగాడని చురకలు అంటించారు. మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతూన్నాడు…దమ్ముంటే ఆధారాలతో రా అని లోకేష్ కు సవాల్‌ విసిరారు. లోకేష్ పాదయాత్రకు జనాలు లేరు…కనీసం పదిమంది కూడా ఉండడం లేదు…చిత్తూరు జిల్లాలో కనీసం ఇన్ చార్జ్ లూ కూడా లేని పార్టీ వాళ్ళదన్నారు. లోకేష్ నావల్ల కాదని జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నాడు…ఇది చంద్రబాబు పార్టీ కాదు …ఎన్టీఆర్ గారి పార్టీ అని వెల్లడించారు రోజా. ఎన్టీఆర్ వస్తే తప్ప.. పార్టీ బతకదని అర్థం అయ్యిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news