శ్రీదేవి పై ప్రేమను మొదటిసారి నా భార్యకే చెప్పాను.. బోనీ కపూర్

-

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి ఐదు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఆమె ఈ లోకంలో లేదు అనే విషయాన్నిఎవరు నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమె అందం, అమాయకత్వం, నటన కళ్ళ ముందు కదులుతుంటే శ్రీదేవి ఈ లోకంలో లేదనే విషయాన్ని మరిచిపోతూ ఉంటారు ఆమె అభిమానులు. ఇక ఆమె కుటుంబ సభ్యులు సైతం ఎప్పటికప్పుడు శ్రీదేవి లేని లోటును గుర్తు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె భర్త బోనికపూర్ శ్రీదేవితో తన అందమైన ప్రేమ ప్రయాణం ఎలా గడిచిందో చెప్పుకోచ్చారు..

అతిలోక సుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. కానీ ఆమె అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. 2018లో దుబాయ్ లో హోటల్ లో శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పలు సందర్భాల్లో ఆమె కూతురు జాన్వి కపూర్ భర్త బోని కపూర్ శ్రీదేవి గురించి ఎమోషనల్ కోట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటారు..

Most Surprising Bollywood Celebrity Marriages Of All-Time

శ్రీదేవి అభిమానుల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన రోజును గుర్తుచేసుకున్న ఆమె భర్త బోనికపూర్.. ఆమెతో తన అందమైన ప్రేమ ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న మెమొరబుల్ ఫోటోలను పంచుకున్న బోని ఆమెను తన ప్రేమలో ఎలా పడేసారో చెప్పుకొచ్చారు.

మొదటిసారి శ్రీదేవిని ఓ తమిళ చిత్రంలో చూశాను. ఆమెతో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకొని శ్రీదేవిని కలవడానికి వెళ్లాను. తొలిసారి పరిచయంలోనే ఎంతగానో నచ్చింది. ఆమెతో సినిమా చేయాలని శ్రీదేవి తల్లిని కలిసి మాట్లాడగా రెమ్యూనరేషన్ ఎనిమిది లక్షలు ఇస్తా అని చెప్పాను. కానీ శ్రీదేవి తల్లి 10 లక్షలు కావాలి అని అన్నారు. ఆ తర్వాత 11 లక్షలు ఇస్తానని చెప్పి సర్ప్రైజ్ చేశాను. షూటింగ్ సమయంలో ఆమె వెంట తిరుగుతూ ఉండేవాడిని. ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడిని. అయితే అప్పటికే నాకు పెళ్లయిపోయింది. అయితే శ్రీదేవి పై నాకున్న ఫీలింగ్ మొదటిగా నా భార్యకే చెప్పాను. ప్రతిక్షణం శ్రీదేవి కోసం నేను తీసుకున్న జాగ్రత్తలు కేరింగ్ ఆమె నన్ను ప్రేమించేలాగా చేశాయి. ఇలా ఆమెతో నా ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు వెళ్లిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news