రూటు మార్చిన హీరో గోపీచంద్.. ఇలాగైనా నిలబడతాడా.. ?

-

ప్రపంచాన్నిముంచెత్తుతున్న కరోనా వల్ల ప్రతివారి పరిస్దితి ఆగమ్యగోచరంగా మారింది.. ఇలాంటి నేపధ్యంలో ఉద్యోగాల మీద ఆధారపడి బ్రతికే వారి పరిస్దితులు మరీ దారుణంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ కరోనా సంక్షోభం చిత్రపరిశ్రమను కూడా అతలాకుతలం చేస్తుంది.. ఇప్పటికే సినిమా చిత్రీకరణలు మొదలవక, ప్రొడ్యూసర్లతో పాటుగా, నటీనటులు, డైరెక్టర్లు ఇలా అన్ని శాఖల వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. ఇక ఫ్లాపు హీరోల సంగతి అయితే చెప్పవలసిన అవసరం లేదు.. ఈ పరిస్దితుల్లో వారితో సినిమాలు తీయడానికి ఎవరు సాహసం చేయరు..

ఇలాంటి లాక్‌డౌన్ పరిస్దితుల్లో ధియోటర్లు కూడా ఇప్పుడప్పుడే తెరచుకోవడం చాలా కష్టంగా కనిపిస్తుండగా వినోదం కోసం ఓటీటీలే దిక్కు అయ్యాయి. అంతే కాదు లాక్‌డౌన్ కారణంగా జనాలు ఓటీటీలకి బాగా అలవాటు పడ్డారు. దాంతో ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అందువల్ల మారుతున్న పరిస్థితులను అందిపుచ్చుకోవడానికి కొందరు హీరోలతో పాటుగా, హీరోయిన్స్ కూడా ఇందులో నటించడానికి ఒప్పుకుంటున్నారు.. ఓటీటీలకి విపరీతమైన డిమాండ్ ఉంటుందన్న కారణంగా హీరోలు సైతం స్ట్రీమింగ్ సైట్స్ కోసం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు.

 

ఇక తాజాగా హీరో గోపీచంద్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, అందుకే ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నాడని అంటున్నారు. ఇకపోతే ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా అయినా గోపీచంద్ హిట్ సాధిస్తాడేమో చూడాలంటున్నారు సినిమా పక్షులు..

Read more RELATED
Recommended to you

Latest news