వివాదంలో రౌడీబేబీ సీడీపీ..

-

ధనుష్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన మారి 2 చిత్రంలోని రౌడీబేబీ పాట బిలియన్ వ్యూస్ దక్కించుకుని రికార్డు క్రియేట్ చేసింది. దక్షిణాదిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పాటగా గుర్తింపు తెచ్చుకున్న రౌడీబేబీ పాట కోసం సీడీపీని వదిలారు. ప్రస్తుతం ఈ సీడీపీ అభిమానుల విమర్శలు ఎదుర్కొంటుంది. బిలియన్ వ్యూస్ తెచ్చుకున్నందుకు సంబరాల్లో భాగంగా వదిలిన సీడీపీ అందరి విమర్శలు ఎదుర్కొంటుంది.

దానికి కారణం ఆ సీడీపీలో సాయి పల్లవి లేకపోవడమే. చిత్ర నిర్మాణ సంస్థలు తయారు చేసిన సీడీపీలో కేవలం ధనుష్ ని మాత్రమే ఉంచడంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. రౌడీబేబీ పాటలో సాయి పల్లవి, ధనుష్ ల మధ్య కెమిస్ట్రీ, స్టెప్పులు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. అయినా కూడా ఆ పాటకి సంబంధించిన కామన్ డిస్ ప్లే లో కూడా కేవలం హీరోని ఉంచడం నెటిజన్లని ఆగ్రహానికి గురి చేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news