IPL 2022 : గుజరాత్‌ పై బెంగళూరు విక్టరీ..టోర్నీ నుంచి హైదరాబాద్‌, పంజాబ్‌ ఔట్‌ !

-

కీలకమైన మ్యాచ్‌ లో ఆర్జీబీ గెలిచి.. ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గుజరాత్‌ పై 8 వికెట్ల తేడాతో నిన్న మ్యాచ్‌ గెలిచింది బెంగళూరు. ఫాంలో లేక సతమతమౌవుతున్న విరాట్‌.. ఈ మ్యాచ్‌ లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. అయితే.. ఈ గెలుపుతో.. బెంగళూరు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు అయినట్లు కాదు. శనివారం ముంబై తో జరిగే మ్యాచ్‌ లో ఢిల్లీ విజయం సాధిస్తే.. బెంగళూరు బదులు ఢిల్లీనే ప్లే ఆఫ్స్‌ కు వెళుతుంది.

అయితే.. ఈ విజయంతో.. హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు మాత్రం ప్లే ఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. సాంకేతికంగా కూడా ఆ జట్లకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశమే లేదు. ఇక గుజరాత్ బ్యాటింగ్‌ విషయాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు కు 169 పరుగులను లక్ష్యంగా ఉంచింది. ఛేజింగ్‌ కు దిగిన.. బెంగళూరు జట్లు… 170 పరుగులు చేసి.. గ్రాండ్‌ విక్టరీ అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news