:ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ట్రిపుల్ ఆర్ ఓటీటీ డేట్ ఫిక్స్

-

ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చారిత్రాత్మక కథాంశంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో రికార్డు వసూల్లు సాధించింది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తుండటంతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవ్ గన్, అలియా భట్ వంటి స్టార్ కాస్ట్ తో వస్తుండటంతో ఇండియా వైడ్ గా సూపర్ బజ్  క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ దగ్గర నుంచి రికార్డ్ వసూళ్లను సాధించింది.

తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ట్రిపుల్ ఆర్ టీం. ఆర్ఆర్ఆర్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 3న ఓటీటీలో విడుదల కానున్నట్లు క్లారిటీ ఇచ్చింది. జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో ట్రిపుల్ ఆర్ సినిమా స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండనుంది. ఇప్పటికే బిగ్ స్క్రీన్ పై అనేక రికార్డులు క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ఇక ఓటీటీల్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news