కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు: ఎస్ఎస్ రాజమౌళి

-

ట్రిపుల్ ఆర్ కోసం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మా సినిమా గురించి చెప్పిన వెంటనే… డెఫినెట్ గా రేట్లు పెంచుకోండని.. ఇది మన తెలుగు సినిమా గౌరవం అని చెప్పి టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని… వెంటనే జీవోను పాస్ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు థాంక్స్ తెలిపారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు మా సినిమా రేట్ల గురించి అడిగినప్పుడు అర్థం చేసుకుని.. రేట్లు మరీ పెంచకుండా.. పేదవారికి సినిమా దూరం కాకుండా బ్యాలెన్స్డ్ గా రేట్లు పెంచారని రాజమౌళి అన్నారు. తమకు సహకరించినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిగారికి, కోడాలి నాని గారికి ప్రత్యేకంగా థాంక్స్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన అనేక మాటలు పడ్డారని.. టికెట్ రేట్లు పెరిగేందుకు సహకరించారని రాజమౌళి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news