‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫుల్ హ్యాపీ.. ఆర్టీసీ బస్సులో థియేటర్ విజిట్.. సజ్జనార్‌కు స్పెషల్ థాంక్స్..

-

ప్రజెంట్ దేశవ్యా్ప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన చర్చే జరుగుతున్నది. టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ రామ్ చరణ్, తారక్ నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’ చూసేందుకు సినీ ప్రియులు పోటెత్తుతున్నారు. థియేటర్స్ వద్ద జనాలు గుమిగూడుతున్నారు. టికెట్స్ కోసం ట్రై చేస్తున్నారు.

ఇక అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సినిమా ఎలా నడుస్తుంది? అభిమానులు, ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకునేందుకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ బయల్దేరింది. ఈ నేపథ్యంలో వారి కోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఐపీఎస్ ప్రత్యేక ఏసీ బస్సు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనే మెసేజ్ ఇవ్వడంతో పాటు వారికి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం పట్ల ప్రశంసలు అందుకుంటున్నారు సజ్జనార్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులు ఈ ప్రత్యేక బస్సులోనేథియేటర్స్ ను విజిట్ చేయనున్నారు. తెలంగాణ సర్కారు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ముందు నుంచి బాగానే సహకరిస్తున్నది. నిరంతరం తమకు సహకరించడాన్ని గౌరవిస్తున్నామని ఈ సందర్భంగా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే బెన్ ఫిట్ షో, ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ షోలు చూసి సినీ ప్రేక్షకులు వెరీ హ్యాపీగా ఫీలవుతున్నారు. సినిమా వేరే లెవల్ అని అంటున్నారు. ఈ క్రమంలోనే థియేటర్ విజిట్ సందర్భంగా హౌజ్ ఫుల్ బోర్డులు చూసి ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులు ఆనంద పడిపోతున్నారు.

ఈ లెక్కన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఇప్పటి వరకు ఉన్న సినీ రికార్డులన్నిటినీ తిరగరాస్తాయని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చిత్రం చూస్తున్నంత సేపు సీటు అంచుల్లోనే ప్రేక్షకులు ఉంటున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌ల చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయని పలువురు చెప్తు్న్నారు. ప్రేక్షకులు ఎవరైనా సినిమా చూస్తే భావోద్వేగాలకు గురి కావాల్సిందేనని అంటున్నారు.

https://www.instagram.com/reel/Cbg38svrCNI/?utm_source=ig_web_copy_link

 

Read more RELATED
Recommended to you

Latest news