ప్రాణత్యాగానికైనా సిద్దమే : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

-

కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాటం కోసమే రాజీనామా చేశానని పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం ప్రాణత్యాగానికైనా సిధ్ధమే అని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా పేద ప్రజలకు చేసింది 1 శాతమేనని పేర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మిగిలిన 99 శాతం ప్రజలకు న్యాయం చేసేందుకు ఐపీఎస్ పదవికి స్వచ్చందంగా రాజీనామా చేయనని ప్రకటించారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుందని, కానీ కుల వృత్తులు గ్రామాల్లో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలు, ఉప ఎన్నికల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్య, వైద్యం కోసం ఖర్చు చేసి బహుజనుల అభివృద్ధికి పాటు పడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బహుజనుల పక్షాన నిలబడి బహుజన రాజ్యాధికారానికి కృషి చేస్తానని ప్రకటించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news