Rashmika : రష్మికపై మరో క్రేజీ రూమర్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

-

కన్నడ క్యూటీ.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి అవకాశాలు తలుపుతడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లో సూపర్ హిట్‌ హీరోయిన్‌గా నిలిచిన ఈ భామ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అక్కడ కూడా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.

అయితే ఈ బ్యూటీపై ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. దానిపై అప్పుడప్పుడు ఈ భామ స్పందిస్తూ క్లారిటీ ఇస్తోంది కూడా. అయితే తాజాగా ఓ భామకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఐదేళ్లల్లో రష్మిక.. కూర్గ్‌, ముంబయి, హైదరాబాద్‌, గోవా, బెంగళూరు నగరాల్లో ఐదు విలాసవంతమైన ఇళ్లను ఆమె కొన్నట్లు ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఈ ట్వీట్‌పై రష్మిక స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తున్నారో తనకి అర్థం కావడం లేదని, అవన్నీ నిజమైతే బాగుండు అని చెప్పుకొచ్చింది. రష్మిక ఇటీవలే ‘వారిసు’, ‘మిషన్‌ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘యానిమల్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news