Sachin Tendulkar: క్రికెట్ దేవుడికి అయోధ్య రాముని ఆహ్వానం

-

అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవము కోసం యావత్ భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్లలల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనుండగా.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇదిలావుంటే, భారత క్రికెటర్ సచిన్ కి రామ జన్మభూమి తీర్జ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం అందింది.

రామ జన్మభూమి తీర్జ్ క్షేత్ర ట్రస్టు దేశవ్యాప్తంగా వివిధరంగాలకు చెందిన సుమారు పదివేల మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు టాప్ హీరోలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు అతని తనయుడు రామ్ చరణ్, మోహన్ బాబు,అక్కినేని నాగార్జున ,ప్రభాస్ వంటి పలువురు హీరోలకు అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలిరావొచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news