యాదాద్రి, వర్గల్‌ ఆలయాలకు భోగ్‌ సర్టిఫికెట్..తెలంగాణ టెంపుల్స్‌కు తొలిసారి దక్కిన గుర్తింపు

-

యాదాద్రి  శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి, వర్గల్‌ ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తెలంగాణలోని రెండు ఆలయాలకు భోగ్‌ సర్టిఫికెట్‌ రావడం ఇదే మొదటిసారి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ప్రతి సంవత్సరం జాతీయ సర్టిఫికెట్‌ ‘బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ ‘(భోగ్ )ను ఇస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది దేశంలోని 70 దేవాలయాలు దరఖాస్తు చేసుకోగా తెలంగాణకు 2 సర్టిఫికెట్లు రావడం విశేషం.

 


యాదాద్రి, వర్గల్ దేవాయాలను కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం సందర్శించి ఆలయాల్లో నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, ఆహారం తయారు చేసే విధానం, శుచి, కిచెన్ నిర్వహణ,శుభ్రత అంశాలపై పరిశీలన చేసింది. ఫుడ్ సేఫ్టీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత కేంద్ర బృందం భోగ్ గుర్తింపునకు రిఫర్ చేసింది.ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమల వర్ధన్‌రావు స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శనివారం ఆలయ అధికారులకు భోగ్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ప్రత్యేక నోడల్ అధికారిణి, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.సుమన్ కళ్యాణ్, అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి,జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి అధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news