వన్ డే “వరల్డ్ కప్ 2023 “బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెట్ దేవుడు !

-

ఇండియా లో వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ జరగడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 19వ తేదీ వరకు జరగనున్న ఈ మ్యాచ్ లకోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వరల్డ్ కప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా క్రికెట్ దేవుడుగా భారతీయులు భావించే సచిన్ టెండూల్కర్ ను నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా ఐసీసీ తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం విశేషం. ఇక క్రికెట్ కోసం సచిన్ ఏమి చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాడన్నది తెలిసిందే. అందులోనూ ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుండడంతో సచిన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

ఇక మొదటి మ్యాచ్ గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన మొదటి మ్యాచ్ జరగనుంది. కాగా టీం ఇండియా తన తొలి మ్యాచ్ ను అక్టోబర్ 8వ తేదీన ఆస్ట్రేలియా లాంటి గట్టి టీం తో ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news