తెలంగాణలోని ఆ అమ్మవారికి పందిని బలిస్తారట.. ఎందుకంటే?

-

సాదారణంగా కొందరు అమ్మవార్లకు జంతుబలి ఇస్తారు.కొందరు కోళ్లను బలిస్తె, కొందరేమో మేకలు, పొట్టేలు, దున్నలను బలి ఇస్తారు..కానీ పందిని బలి ఇస్తారని ఎప్పుడూ విని ఉండరు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన అమ్మవారికి పందిని బలిస్తారట.. దాని వెనుక పెద్ద కారణం ఉందని అంటున్నారు.ఆ అమ్మవారు ఎవరూ..ఎందుకు పందిని బలి ఇస్తారనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

అన్నం పెడుతున్న భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అడవితల్లి ఆ గిరిజనులకు అమ్మలా కనిపిస్తుంది. చాలా మంది రైతులు తొలకరి చినుకులు కురవగానే ఎద్దులు, నాగలితో దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. కానీ ములుగు జిల్లా ఏటూరునాగారం

పరిధిలోని ఇప్పలగడ్డ తండాలోని గిరిజనులు మాత్రం మొదటగా భూమాతకు పూజ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు.వీరు విత్తనం పండుగ అని పిలుస్తుంటారు. ఈ సాంప్రదాయం కేవలం గిరిజనులలో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ పండుగను జరుపుకోవడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం.

ఈ సంప్రదాయం తాతల ముత్తాతల నుండి పూర్వీకుల నుంచి కొనసాగుతుంది..అయితే,గిరిజన పెద్దలంతా కలిసి ప్రతి కుటుంబం నుంచి కొంత మొత్తంలో డబ్బులు పోగు చేసుకుంటారు. పోగుచేసిన డబ్బులతోనే విత్తనం పండుగను నిర్వహిస్తుంటారు. ప్రతి కుటుంబం నుంచి తెచ్చిన ధాన్యాలను కొన్ని భూదేవి వద్ద నాటుతారు. అనంతరం పొలం వద్దకు వెళ్లి మైసమ్మకు జంతు బలి సమర్పిస్తారు.

పొలాల మధ్యలో ఉండే మైసమ్మ తల్లికి పందిని బలి ఇవ్వడం వల్ల పైరుకు మంచిదని, పంటను నాశనం చేసే పందులు మేలు చేస్తాయని వారి నమ్మకం..భూదేవికి పూజ, మైసమ్మకు జంతు బలి తర్వాత ఈ పండుగలో గ్రామ దేవతలకు ఇప్ప పువ్వులతో చేసిన సారాయిని నైవేద్యంగా ఆరబోస్తున్నారు గిరిజనులు. గ్రామంలో అందరు సమానమే అన్న భావన వచ్చేలా బలి ఇచ్చిన పంది మాంసంతో ఊరు పెద్దలందరూ సామూహిక విందు భోజనాలు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ పనులు మొదలు పెడతారు..

Read more RELATED
Recommended to you

Latest news