బీజేపీ తీర్థం పుచ్చుకున్న సాధినేని యామిని..

-

టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని శర్మ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న షెకావత్ ఓ కార్యక్రమంలో యామిని శర్మకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

ఇక గత ఏడాది నవంబర్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ఫ్రాథమిక సభ్యత్వానికి యామిని శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె స్పష్టం చేశారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో టీడీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. తదనంతర పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఆమె కమల దళంలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news