పుష్ప షూట్ లో తీవ్ర విషాదం

-

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్ అంతా ఇప్పుడు షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లి అడవిలో ఉంది. ఈ క్రమంలో యూనిట్ లో విషాదం చోటుచేసుకుంది చెబుతున్నారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రముఖ స్టిల్ ఫొటో గ్రాఫర్ శ్రీనివాస్ అనే ఆయన ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. పుష్ప షూటింగ్ నిమిత్తం మారేడుమిల్లి వెళ్లిన శ్రీనివాస్ కి ఒంట్లో బాగుండక పోవడంతో లొకేషన్ లో ఉన్న అంబులెన్స్ లో రాజమండ్రి తీసుకువస్తున్నారు.

pushpa
pushpa

అలా తీసుకు వస్తున్న క్రమంలో ఆయన దారిలోనే మరణించారని తెలుస్తోంది. శ్రీనివాస్ దాదాపు 200 పైగా సినిమాలలో స్టిల్ ఫొటోగ్రాఫర్ గా పనిచేశారు ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో కూడా ఈ సినిమా యూనిట్ లో కరోనా కలకలం రేగింది. దీంతో అప్పటికప్పుడు షూటింగ్ అంతా ఆపేసి హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో సినిమా యూనిట్ లో విషాదం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news