వీ.కే.నరేష్ కొడుకు కోసం ముందుకు వచ్చిన సాయి ధరంతేజ్..!

-

ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు అని నిరూపించుకున్నారు మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా మామగారి బాటలోనే నడుస్తున్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇప్పటికే విరూపాక్ష సినిమా షూటింగ్ పూర్తి కావస్తుండగా త్వరలోనే పవన్ కళ్యాణ్ తో వినోదయ సీతం రీమేక్లో కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ గురించి చెప్పాలి అంటే మెగా మేనల్లుడు అనే గర్వాన్ని చూపించకుండా చిన్న సినిమాలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. స్నేహానికి ప్రాణం ఇస్తాడు.

ఈ క్రమంలోనే తన ప్రాణ స్నేహితులలో నవీన్ కృష్ణ కూడా ఒకరు. ఈయన ఎవరో కాదు సీనియర్ నటుడు వీకే నరేష్ కొడుకు.. ఈయన పూర్తి పేరు నవీన్ విజయకృష్ణ. ఇతను హీరోగా పలు సినిమాలలో కూడా నటించాడు. నందిని నర్సింగ్ హోమ్ , రెండు జళ్ళ సీత వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నవీన్ ప్రస్తుతం డైరెక్టర్గా మారాడు. దిల్ రాజు సమర్పణలో సత్య అనే మ్యూజిక్ వీడియోలో తేజు నటిస్తున్నాడు. ఈ వీడియోకి నవీన్ కృష్ణ అండ్ టీం దర్శకత్వం వహిస్తోంది. ఈ మ్యూజిక్ వీడియోలో సాయి ధరంతేజ్ తో పాటు కలర్స్ స్వాతి కూడా నటిస్తోంది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ఈ మ్యూజిక్ వీడియో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. దేశం కోసం ప్రాణం వదిలిన ఎంతో మంది భారతీయులకు నివాళిగా ఈ పాట రిలీజ్ చేశారు. మంచి కాన్సెప్ట్ కావడంతో నవీన్ కోసం సాయిధరమ్ తేజ్ ఈ మ్యూజిక్ వీడియోలో భాగమైనట్లు తెలుస్తోంది. ఇందులో కలర్స్ స్వాతి నటిస్తున్నట్లు సమాచారం. మరి ఈ పాట ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news