చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ ఎక్కడికి వెళ్లిందో తెలుసా..?

-

శేఖర్ కమ్ముల సినిమాలు యువతును ఎంతగా ఆకర్షిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజ జీవితానికి ఎంతో దగ్గరగా ఉండే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక ఫిదా సినిమా తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం… అక్కినేని నాగచైతన్య ఫిదా బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్లో లవ్ స్టోరీ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ లో ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ జలపాతం ప్రాంతంలో సినిమా షూటింగ్ జరిగే ప్రస్తుతం నిజాంబాద్ లోని ఆర్మూర్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పచ్చదనంతో కూడిన వాతావరణం లో సాయి పల్లవి నాగచైతన్య మధ్య కీలక సమావేశాలకు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తెలుస్తోంది. కాగా ఈ సినిమాపై అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news