ఆ సమయంలో కన్నీళ్లు వచ్చేశాయ్.. సాయి పల్లవి ఎమోషనల్ వర్డ్స్!

-

సరళ కుటుంబాన్ని చూసిన హీరోయిన్ సాయిపల్లవి ఎంతో ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. గొప్ప మనసున్న వాళ్లు మళ్లీ పుడతారు.. వాళ్లు సాధించాలని అనుకున్న పనిని త్వరలో సాధిస్తారని న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి అన్నారు. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపర్వం’ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో దగ్గుబాటి రాణా హీరోగా నటించారు. కాగా, ప్రియమణి, నివేదా పేతురాజ్, ఈశ్వరీ, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు.

హీరోయిన్ సాయిపల్లవి
హీరోయిన్ సాయిపల్లవి

1990లో సరళ అనే మహిళ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ మేరకు శనివారం విరాటపర్వం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరోయిన్ సాయిపల్లవి ఎమోషనల్ మాటలు మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘సరళ గారి అన్నయ్య మోహన్ రావుకు ధన్యవాదాలు. వారి ఇంటికి వెళ్లినప్పుడు నన్ను ఆశీర్వదించి చీర, బొట్టు పెట్టి దీవించారు. వారి కుటుంబాన్ని చూసి నా గుండె బరువెక్కింది. గొప్ప మనసున్న సరళ మళ్లీ పుడతారు.’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news