ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

-

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అబద్దాలు చెప్పే వారిని మనం ఏం చేద్దామని ప్రశ్నించారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేయాలనుకుంటున్నారు. బీజేపీ చేసిన చట్టం ఇది.

గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. సూపర్ 6 ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామని తెలిపారు. కూటమి మేనిఫెస్టో ప్రవేశపెట్టడం బీజేపీకి ఇష్టం లేదని స్పష్టం చేశారు. వివాదాలు తలెత్తకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ఇది అమలు అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో 5వేల గ్రామాలకు పైగా అమలు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news