హైదరాబాద్‌కు వచ్చిన సల్లూ భాయ్.. భారీ భద్రత ఏర్పాటు..!!

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (సల్లూ భాయ్) హైదరాబాద్ చేరుకున్నారు. ఫర్హద్ సామ్‌జీ దర్శకత్వంలో వస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమా షూటింగ్ నేపథ్యంలో రామోజీ ఫిల్మ్‌ సిటీకి రానున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సెట్‌లో సుమారు నెల రోజులపాటు షూటింగ్ జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్ టాక్. అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించనున్నారు. త్వరలో వెంకటేశ్ కూడా షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం.

Salman-Khan
Salman-Khan

అయితే సల్మాన్ ఖాన్ హైదరాబాద్ చేరుకోవడంతో.. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖలు వస్తున్నాయని సల్మాన్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news