ట్రోలర్స్‌కు సమంత స్ట్రాంగ్ కౌంటర్

-

సమంత ‘శాకుంతలం’ ట్రైలర్​ లాంచ్ సోమవారం గ్రాండ్​గా జరిగింది. చాలా కాలం తర్వాత సామ్​ లైమ్‌లైట్‌లోకి రావడం చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి సామ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతపై సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ పెట్టిన పోస్ట్​ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

ట్విటర్​కు చెందిన బజ్​ బాస్కెట్​ అనే ఓ పేజీ​ సమంత ఫొటోలతో ఓ క్యాఫ్షన్​ ఇమేజ్​ను షేర్​ చేసింది. “సమంతను చుస్తుంటే బాధనిపిస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. విడాకుల నుంచి బయటపడ్డ ఆమె.. సినీ కెరీర్​లో టాప్​లో ఉన్న టైమ్​లో.. మయోసైటిస్ వ్యాధి బారిన పడిమరింత బలహీనురాలయ్యింది” అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

ఈ పోస్టు సామ్​ కంట పడటంతో తను స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. “నేను తీసుకున్న విధంగా మీరు నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. అయితే యశోద మూవీ సమయంలో ‘మయోసిటిస్’ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఓ ఇన్​స్టా పోస్ట్​ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news