స్నేహితురాలితో కలిసి సమంత తీర్థయాత్రలు..!

-

సమంత ప్రస్తుతం తీర్థ యాత్రలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ గడిపేస్తుంది. సమంత తన ఫ్రెండ్ తో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్ళింది. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను శిల్పారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటోలో హెలికాప్టర్ ముందు సమంతతో కలిసి శిల్పరెడ్డి కనిపిస్తోంది. “టేకాఫ్ మొదట యమునోత్రి కి వెళుతున్నాము” అంటూ శిల్పా రెడ్డి తన పోస్ట్ లో పేర్కొంది.

ఆ తర్వాత శిల్పారెడ్డి “చార్ధామ్ యాత్ర ఇప్పటికీ మన స్నేహం చెదిరిపోదు” అంటూ మరో పోస్టును షేర్ చేసింది. ఇక ఈ టూర్ లో భాగంగా సమంత శిల్పారెడ్డి లు గంగానదీతీరాన వశిష్ఠ మహర్షి గుహలను సందర్శించారు. ఆ ఫోటోలను వీడియోలను శిల్పా రెడ్డి స్టోరీస్ లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే సమంత ఇటీవల తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. భర్తతో విడాకుల అనంతరం సమంత మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. ఇక ప్రస్తుతం ఫ్రెండ్స్ తోనూ సమంత ఎంజాయ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news