త్వరలో ముంబాయి చెక్కేస్తున్న సమంత..!!

-

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆమె న్యూస్ లేకుండా సినిమా న్యూస్ వచ్చిన దాఖలాలు లేవు. ఇక ఆమె ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుందో అప్పటి నుండి మీడియా లో ఇంకా హంగామా ఎక్కువ అయ్యింది.

ప్రస్తుతం విజయ్ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో ,సమంత  హీరోయిన్ గా ఖుషి అనే సినిమా చేస్తోంది. ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. తాజాగా సమంత వ్యాధి నుండి కోలుకొని సూపర్ ఫిట్ గా తయారు అయ్యింది. రీసెంట్ గా తన వల్ల ఖుషి సినిమా ఆగి పోయింది అని విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పింది .

తాజాగా సమంత ముంబాయి లోనే ఉండబోతోంది అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బడా ప్రొడక్షన్స్ సమంత డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని తెలుస్తోంది. ఇక సామ్ ముంబాయి లో ఉండటానికి అపార్ట్మెంట్ తీసుకుందని అంటున్నారు . ఇందు కోసం మంచి ఖరీదైన ఏరియాలోని ఓ అపార్ట్ మెంట్ లోలక్సరీ సదుపాయాలున్న ట్రిపుల్ బెడ్రూమ్ కోసం సమంత  15 కోట్లు చెల్లించినట్టుగా బాలీవుడ్  మీడియా సమాచారం. ఇక ఖుషి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ముంబాయి చెక్కేస్తుందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news