Satya Dev: రిలీజ్ డేట్ లాక్ చేసిన ‘గాడ్సే’

-

వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు.ప్రభావవంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్.తాజాగా ఆయన హీరోగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “గాడ్సే” సి.కే.స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. తాజాగా ఈ సినిమాను మే 20న విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు.ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

సత్యదేవ్, గోపి గణేష్ పట్టాభి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన” బ్లఫ్ మాస్టర్” చిత్రం ఇటు ప్రేక్షకుల ఆదరణను, అటు విమర్శకుల ప్రశంశలనుఅటు అమితంగా పొందింది.అలాంటి క్లాసిక్ మూవీ తర్వాత సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ గా గాడ్సే తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ మూవీలో సత్యదెవ్ చాలా పవర్ఫుల్ రోల్ చేయనున్నట్లు  చిత్ర బృందం విడుదల చేసినపోస్టర్ ద్వారా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news