అదిరే ఆఫర్.. ఆ ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు లోన్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్ఐసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతిపెద్ద ఐపీఓలో పాల్గొనేందుకు ఆ సంస్థ ఉద్యోగులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లపై లోన్స్ ని ఇస్తున్నట్టు చెప్పింది. అయితే ఈ లోన్ ప్రొడక్టును ప్రత్యేకంగా ఎల్ఐసీ ఉద్యోగులు వారి కంపెనీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి తీసుకొచ్చింది.

ఇక పూర్తి వివరాలను చూస్తే.. బుధవారం మొదలైన ఐపీవో మే 9వ తేదీ వరకు ఉంటుంది. ఒక్కో షేరుపై రూ.45 డిస్కౌంట్ ఇస్తోంది. గరిష్టంగా రూ.2 లక్షల వరకు బిడ్ ని ఇండివిడ్యువల్స్ వేసుకోచ్చు. ఉద్యోగిగా, రిటైల్ ఇన్వెస్టర్‌గా, ఎల్ఐసీ పాలసీహోల్డర్‌గా ఇలా మూడు కేటగిరీల కింద బిడ్ వేసుకోచ్చు.

ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోన్న లోన్ ప్రొడక్టు వివరాలు ఇవే:

ఈ లోన్ ని ఏడాది నుంచి కంపెనీలో పనిచేస్తోన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.20 లక్షల వరకు లోన్ వుంది.
ఏడాదికి 7.10 శాతం స్పెషల్ ఇంటరస్ట్ రేటుకి 100 శాతం మార్జిన్‌తో ప్రొడక్టును ఆఫర్ చేస్తుంది.
లోన్ టెన్యూర్ 60 నెలలు.
లోన్ మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది.

ఐపీఓ లోన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ముందు స్టేట్ బ్యాంక్ పేజ్ లోకి కానీ https://sbi.co.in/web/home/lic-ipo లోకి కానీ వెళ్ళండి.
నెక్స్ట్ మీ పేరు, మెయిల్ ఐడీ, ఎల్ఐసీ ఉద్యోగి లేదా ఎల్ఐసీ పాలసీహోల్డర్ లేదా ఇతర వివరాలతో మీ కేటగిరీ ని సెలెక్ట్ చేసి. వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news