వాయిదా ప‌డ్డ స‌ర్కారువారి పాట రెండో షెడ్యూల్‌.. వ‌ద‌ల‌ని కొవిడ్‌!

-

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్‌. ఆయ‌న సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత మ‌హేశ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి సినిమా రాలేదు. అందుకు కార‌ణం కూడా లేక పోలేదు. అంద‌రి లాగే త‌న సినిమాకు కూడా కొవిడ్ పెద్ద ఇబ్బందిగా మారింది. అయినా కూడా ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్‌లో ‘సర్కారు వారి పాట’ పేరుతో ఓ సినిమాను వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కానీ మ‌హేవ్ ప్లాన్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది.

ఇప్పటికే మొద‌టి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రెండో షెడ్యూల్ జ‌రిపేందుకు టీం రెడీ అవుతోంది. కాగా మూవీ షూటింగ్ కూడా దుబాయ్ లో ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. అక్కడి ఎడారిలో ఓ ఫైట్ సీక్వెన్స్ కు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్ప‌టికే బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక షూట్లు కూడా చేశారు. దీని త‌ర్వాత ఇక కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాలని అనుకున్నారు మూవీ బృందం.

కానీ ఆ ప్లాన్‌ను మళ్లీ దుబాయ్ కు షిఫ్ట్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. కొందరికి వీసాలు దొరక్క మళ్లీ దుబాయ్ లోనే త‌మ రెండో షెడ్యూల్ చేయాల‌ని భావిస్తున్నారు. కానీ దుబాయ్‌లో కొవిడ్ కేసులు ఎక్కువుగా న‌మోద‌వ‌డంతో ఈ షెడ్యూల్‌ను కాస్తా హైదరాబాద్‌లోనే చేద్దామ‌నుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండ‌టంతో రెండో షెడ్యూల్ ను ప్ర‌స్తుతానికి వాయిదా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. భారత బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసే కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుంద‌ని స‌మాచారం. సినిమాలో హీరో తండ్రి పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని, హీరో ఆయ‌న‌కు స‌పోర్టుగా ఉంటాడ‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news