రవితేజ ‘రావణాసుర’ నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

-

ధమాకా, వాల్తేరు వీరయ్యలతో ట్రాక్ లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టి తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టైటిల్‌ పోస్టర్‌ నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవలే రిలీజైన రావణాసుర ఆంథమ్‌ సాంగ్ ప్రేక్షకులకు మామూలు కిక్ ఇవ్వలేదు. ఆ కిక్ నుంచి ఇంకా తేరుకోక ముందే మరో క్రేజీ అప్డేన్ ప్రకటించింది ఈ చిత్రబృందం.

‘ప్యార్‌లోన పాగల్‌’ అంటూ సాగే సెకండ్‌ పాటను ఫిబ్రవరి 18న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ర‌వితేజ‌కు జోడీగా అనూ ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌, ఫ‌రియా అబ్దుల్లాలు న‌టిస్తున్నారు. అక్కినేని సుశాంత్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి ర‌వితేజ ఆర్‌టీ టీం వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్‌ 7న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news