ఏం జరుగుతుంది…? ఏపీ పోలీస్ వర్గాల్లో భారీ టెన్షన్…!

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారం నుంచి కూడా చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా ఆసక్తిని రేపుతున్నాయి. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనే ఆరోపణలు ఆసక్తిని రేపాయి. ఆ తర్వాత హైకోర్ట్ వైద్య పరిక్షలకు సంబంధించి ఆదేశాలు ఇచ్చింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరిక్షలు నిర్వహించారు. ఆ పరిక్షల రిపోర్ట్ పై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసారు.

వాచింది గాని కొట్టింది అని చెప్పలేము అంటూ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆయనను గనుక కొట్టారు అని పరీక్షల్లో గుర్తిస్తే మాత్రం కచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉండవచ్చు. హైకోర్ట్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చింది. దీనితో ఏపీ పోలీస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news