రాష్ట్రంలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ. బీజేపీ, టీఆర్ఎస్ తీరుపై సీతక్క ఫైర్

-

బీజేపీ, టీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్, తిరుమల గిరిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క సర్కార్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో కుస్తీ పడుతూ.. ఢిల్లో దోస్తీ చేస్తున్నాయని విమర్శించారు. ధర్నా చౌక్ ను ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ధర్నాలు చేసేందుకు అర్హత కూడా లేదు అని దుయ్యబట్టారు సీతక్క. ఈపర్యటనలో స్థానికంగా ఉండే సుజాతమ్మ అనే నిరపేద ఇంటిని సందర్శించారు.

నిరుపేద సుజాతమ్మకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుకట్టించడం అభినందనీయం అన్నారు. పేదలు ఇండ్లు లేక పూరిళ్లలో ఉంటే ఇండ్లుకట్టించేందుకు ప్రభుత్వానికి దమ్ము లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణాలో వరి కొనుగోళ్ళ విషయంలో కేసిఆర్ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను యుద్దప్రాతిపదికన పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్స్, స్కూల్స్ సంఖ్య ఎందుకు పెంచడంలేదని సీతక్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మద్యంమత్తులో ముంచి పబ్బం గడుపుకొంటుందన్నారని తీవ్ర విమర్శలు చేశారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news