మద్యం తాగలేదని జూనియర్‌‌ను చితకబాదిన సీనియర్లు.. ఐదుగురి అరెస్టు!

-

హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. సహచర సీనియర్లు ఓ జూనియర్ విద్యార్థిపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. తాము చెప్పిన మాట వినడం లేదని విచక్షణా రహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీనియర్ విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

వివరాల్లోకివెళితే.. బహ్రా యూనివర్సిటీకి చెందిన ఎంబీఏ విద్యార్థి రజత్ కుమార్‌‌ను మద్యం సేవించాలని తోటి సీనియర్లు ఒత్తిడి చేశారు.రూంలో బంధించి నానా చిత్రహింసలు పెట్టారు. అతడు నిరాకరించడంతో మొహంపై కొట్టడంతో పాటు బెల్టుతో దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి ఓ సీనియర్ వీడియో తీయగా..అది కాస్త లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దాడికి పాల్పడిన ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news