బాబు, రేవంత్‌ చంపేస్తారు..కాపాడండి !

-

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు అనే కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు గానూ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి డబ్బులు ఆఫర్ చేసి ఆ డబ్బులు అందజేస్తూ వీడియో కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే ఈ కేసు అప్పటినుంచి ఏమీ తేలలేదు. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఈ కేసులో a4 నిందితుడిగా ఉన్న  జెరూసలెం మత్తయ్య సంచలన ఆరోపణలు చేశారు.

ఈ మేరకు ఆయన మానవ హక్కుల కమిషన్ ని కూడా ఆశ్రయించారు. ఈ కేసు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న ఆయన తదనంతర పరిణామాల్లో బయటకు వచ్చారు. అలాగే ఈ కేసులో తాను అప్రూవర్ గా మారతానని కూడా ఆ మధ్యన సంచలన కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసు హియరింగ్స్ అన్నీ పూర్తయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్ను ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news