మరో వివాదంలో దేవళ్ళ రేవతి.. ఈ సారి హాస్పిటల్ సిబ్బంది మీద దాడి !

-

వడ్డెర చైర్పర్సన్ దేవళ్ల రేవతి నిన్న ఏపీలో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. తనను టోల్ కట్ట మంటారా అంటూ టోల్ ప్లాజా సిబ్బంది మీద ఆమె విరుచుకుపడిన విధానం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఈ అంశం జరిగి గంటల వ్యవధి కూడా కాకుండానే ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి లోని ఓ నర్సింగ్ హోమ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దేవళ్ళ రేవతి మేనల్లుడు అక్కడి సిబ్బంది మీద చేయి చేసుకున్నట్లు సమాచారం.

అక్కడ వైద్యం చేయించుకున్నాక సిబ్బంది బిల్లు కట్టమని కోరారు. అయితే ఇంత బిల్లు అయిందా అంటూ ఆమె అల్లుడు వడియా రాజు నర్సింగ్ హోమ్ సిబ్బందితో గొడవకు దిగినట్లు సమాచారం. అంతే కాదు తాను వడ్డెర చైర్పర్సన్ దేవళ్ల రేవతి మేనల్లుడిని అంటూ నర్సింగ్ హోమ్ నిర్వాహకులను బెదిరించినట్లు సమాచారం. అక్కడ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు కావడంతో నర్సింగ్ హోమ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news