ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్‌గా పెట్టుకున్నారా ? లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ నాయకురాలు, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటులో చంద్రబాబుతో పాటు పురందేశ్వరి హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు తెరమీద కనిపిస్తే.. అంతర్గతంగా ఎన్టీఆర్ కి కుటుంబాన్ని దూరం చేసింది. పురందేశ్వరి అని ఆరోపణలు చేసారు. తానుఇంతవరకు ఈ మాటచెప్పలేదని.. ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నానని చెప్పారు. ఎన్టీఆర్ కూడా అందరి తెలివి ఒక్క పురంధేశ్వరికే వచ్చిందని అన్నారని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరి రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. ఎన్టీఆర్ వద్దన్నారని.. తండ్రి చనిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిందని అన్నారు. పురందేశ్వరి రాజకీయ పిచ్చి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే బీజేపీలో చేరిందని విమర్శించారు. ఇప్పుడు బావ-మరదలు కలిసి ఏపీలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ చంద్రబాబుతో కలిసి పని చేస్తుందని ఆరోపించారు. 

ఎన్టీఆర్ పేరిట స్మారక నాణెం విడుదల చేయడం సంతోషకరమన్నారు పురందేశ్వరి. ఎన్టీఆర్ భార్యగా తనను ఆహ్వానించకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్ గా పెట్టుకున్నారా అని సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.  తనను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రపతి, ప్రధానికి, ఆర్థిక మంత్రికి లేఖ రాశానని.. ప్రభుత్వమేఈ కార్యక్రమం నిర్వహిస్తే ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోవడం తప్పే అన్నారు. ఇన్విటేషన్ చూస్తే ప్రైవేట్ ఫంక్షన్ కి రాష్ట్రపతి గెస్ట్ గా వెళ్తున్నట్టు ఉందని.. ఎన్టీఆర్ భార్యగా తనను పిలవకపోవడం అన్యాయమన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ ప్రాణాలు పోవడానికి కుటుంబ సభ్యులందరూ మూకుమ్మడి కారణమని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news