తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసిన షారుఖ్ ఖాన్.. ఏకంగా సీరియల్ తోనే..

-

బాహుబలి తర్వాత ప్రపంచం చూపంతా తెలుగు ఇండస్ట్రీపై పడింది. ఇక ఆర్ఆర్ఆర్.. మూవీతో టాలీవుడ్ సత్తా ఏంటో ఇంటర్నేషనల్ లెవెల్ గా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లూ.. తెలుగు పరిశ్రమనా.. అని చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు తమ స్టార్ హీరోల సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తోంది.

బాలీవుడ్ గత కొంత కాలంగా ప్రాంతీయ సినిమాలని చిన్న చూపు చూసిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు హిందీ పరిశ్రమ తమ సినిమా దేశ వ్యాప్తంగా వున్న అన్ని ప్రాంతాల వారిని చేరాలంటే ముందు వాళ్లను ఆకర్షించాలనే విషయం గ్రహించింది. ఏదో డబ్ చేసి పారేస్తే చూస్తారనే అహంకారాన్ని వీడి.. ఇదీ మేం చేసిన సినిమా.. దీన్ని మీరు ఆదరించాలని కోరుకుంటున్నామంటూ.. ప్రాంతీయ భాషల ప్రేక్షకులను అర్థిస్తోంది. దీన్ని బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కూడా గ్రహించారు. ప్రాంతీయ భాషలతో పాటు కలిసిపోవాలనే విషయం గ్రహించి మార్పునకు శ్రీకారం చుట్టారు.

తను నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ `పఠాన్` జనవరి 25న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది వారిని కూడా ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనతో  బెట్టు వీడిన షారుక్ ఖాన్ ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో త్వరలో ప్రసారం కానున్న సీరియల్స్ కు ప్రచారం చేస్తూ `పఠాన్` ని ప్రమోట్ చేసుకుంటుండటం గమనార్హం. గతంలో ఇలా ఏ బాలీవుడ్ స్టార్ తెలుగు సీరియల్ కు ప్రచారం చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేసుకోలేదు.

కానీ ఈ సారి కొత్తగా ఓ తెలుగు సీరియల్ ని ప్రమోట్ చేస్తూ షారుక్ తన `పఠాన్` మూవీని ప్రమోట్ చేసుకుంటుండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ మానస్ ప్రధాన పాత్రలో నటించిన సీరియల్ కు షారుక్ ప్రమోట్ చేయడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. దక్షిణాది వారి పట్ల బాలీవుడ్ స్టార్స్ లో వచ్చిన మార్పుని చూసి మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news