మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా శంబీపూర్ రాజు

-

మల్కాజ్‌గిరి ఆసియాలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గం. దాదాపు 31, 50,313 మంది ఓటర్లతో మల్కాజిగిరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానంగా నిలిచింది. అత్యధిక పురుష, మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలపై రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చే జరుగుతుంది. దీంతో ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పట్టు సాధించాలని రాజకీయ పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా శంభీపూర్ రాజు పోటీ చేస్తున్న విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం శంభీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున మైనంపల్లి హనుమంతరావు పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news