బెల్లంకొండ పెద్ద మోసగాడు..నన్ను చంపుతానని బెదిరించాడు : బాధితుడు

-

బెల్లంకొండ సురేష్ పై కేసు వేసిన శరన్ కుమార్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బెల్లంకొండ సురేష్ ది మాది ఒకే ఊరు అని.. పన్నెండు కోట్లతో శ్రీనివాస్ తో సినిమా చేయడానికి అప్రోచ్ అయ్యానని చెప్పారు శరన్. ముందుగా మాలినేని గోపిచంద్, చోటా కే నాయుడు, లక్ష్మీ ప్రొడక్షన్స్ లతో పాటు మరికొన్ని అకౌంట్ లకు తాను మారుగా నగదు బదిలీ చేశానని.. బెల్లంకొండ సురేష్ చెబితేనే ఈ అకౌంట్ ల్లోకి డబ్బులు పంపించానని చెప్పారు. లేకపోతే వాళ్ళకు డబ్బులు పంపించాల్సి నీ అవసరం నాకు లేదని.. సినిమా బడ్జెట్ ను 12 కోట్లు నుండి 25 కోట్లకు పెంచాడని ఫైర్ అయ్యారు.

దీంతో నా డబ్బులు ఒరిగి ఇవ్వమని అన్నాను..అంతకు ముందు సురేష్, నిర్మాత దానయ్యకు డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో తనను అడిగారు.. రాత్రికి రాత్రి డబ్బులు సర్ది ఇచ్చానని పేర్కొన్నారు. నా వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నాడని సురేష్ అంటున్నాడు.. నా వెనకాల అలాంటి వారు ఎవరూ లేరు.. మాది బిజినెస్ మేన్ కుటుంబమని క్లారిటీ ఇచ్చారు. సురేష్ తీసుకున్న డబ్బులు ఇవ్వక పోగా నన్ను చంపుతానని బెదిరించాడని.. అందుకే కోర్టును ఆశ్రయించానని స్పష్టం చేశారు. నా దగ్గరా అన్ని ఆధారాలు ఉన్నాయి.. కోర్టుకు సబ్మిట్ చేశాను.. పోలీసులకు ఇచ్చానని వెల్లడించాడు. సురేష్ పెద్ద మోసగాడు, ఇలా ఎంతో మందిని మోసం చేశాడు..అతని పై పీడీ యాక్ట్ పెట్టాలని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news