IPL 2023 : శార్దూల్ ఠాకూర్‌ కు ఢిల్లీ బిగ్ షాక్ !

-

IPL 2023 కు ముందు శార్దూల్ ఠాకూర్‌ కు ఢిల్లీ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్-2023 కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్-16న ఇస్తాంబల్ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ డిసెంబర్ 16న వేలం జరిగినట్లయితే, నవంబరు 15 లోపు టోర్నీలోని 10 ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ కి సమర్పించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శార్దూల్ ఠాకూర్ ను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ ను 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది సీజన్ లో ఠాకూర్ అంతగా రాణించలేకపోయాడు. 14 మ్యాచ్ లు ఆడిన ఠాకూర్, 15 వికెట్లతో పాటు 120 పరుగులు సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news