నేను ‘తెలంగాణ కోడలి’నే.. కొత్త అస్త్రం సిద్దం చేసిన షర్మిల !

-

ఏపీ సిఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పటికే ఈ మేరకు వైఎస్ అభిమానుల సమ్మేళనం పేరిట రాజకీయ మంతనాలు కూడా చేస్తున్నారు. ఆమె త్వరలోనే పార్టీ ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు వైఎస్ షర్మిల ఒక కీలక అస్త్రం సిద్దం చేసినట్టు చెబుతున్నారు. షర్మిల రాయలసీమ వ్యక్తి అని ఆమె తెలంగాణలో రాజకీయాలు ఎలా చేస్తారు అంటూ టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె అందుకు గాను గట్టి ఆన్సర్ రెడీ చేసిందని అంటున్నారు. అదేమంటే తను తెలంగాణ కోడలిని కాబట్టి తాను తెలంగాణలో రాజాకీయం చేసే హక్కుందని ఆమె పేర్కొనడానికి రెడీ అయిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news