యువత, నిరుద్యోగులను టార్గెట్ చేసిన షర్మిల..!

-

తెలంగాణలో పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్న షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ అభిమానుల పేరుతొ ఆమె వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు ఆమె యూనివర్సిటీ విధ్యార్ధులు, నిరుద్యోగులతో భేటీ నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి ఇప్పటిదాకా ఆమె వైఎస్ అభిమానులు, రాజకీయ నేతలను మాత్రమె కలుస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు వీరిని కలవడం సంచలనంగా మారింది.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలతో వరుసగా భేటీ అవుతున్న షర్మిల ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన పలువురు అభిమానులు లోటస్‌ పాండ్‌ లో కలిశారు.  అయితే నిన్న టి అంజయ్య కేబినెట్‌లో ఆర్థిక, హోంశాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్‌ రెడ్డి వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు. నిన్న షర్మిల ప్రతినిధి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమయిన ప్రభాకర్‌రెడ్డి ఈరోజు షర్మిళను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news